calender_icon.png 24 June, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి

04-06-2025 12:00:00 AM

సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు

ఇల్లెందు టౌన్, జూన్ 3 (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతూ జూన్14న  హైదరాబాదులో అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగు మహాధర్నాను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు పిలుపు నిచ్చారు.

మంగళవారం ఇల్లెందు మండలం కొమరారంలో సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ఖనిజ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను, మావోయిస్టును హత మారుస్తున్నారని విమర్శించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను రద్దుచేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

జూన్ 14న హైదరాబాదులో అఖిలపక్షం నిర్వహించే మహాధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి రావాల ని పిలుపునిచ్చారు. సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు,ఆల్ ఇండియా ట్రైబల్ ఫారం రాష్ట్ర కన్వీనర్ సూర్ణపాక నాగేశ్వరరా వు,జిల్లా కన్వీనర్ మోకాళ్ళ రమేష్,

సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు యదల్లపల్లి సత్యం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి,మాజీ సర్పంచులు వి. సరో జన,మోకాళ్ళ కృష్ణ,వి.శ్రీను,బి. సంతు,పివైఎల్ జిల్లా అధ్యక్షులు చింత నరసింహారావు,రాష్ట్ర నా యకులు వాంకుడోత్ మోతీలాల్, పిఓడబ్ల్యు జిల్లా నాయకులు కల్తీ కోటమ్మ, బి.వెంకటమ్మ, న్యూడెమోక్రసీ మండల నాయకులు జోగా కృష్ణ, మాలు, ఎల్.చినస్వామి, పూనెం లక్ష్మీనారాయణ, పూణెం కోటయ్య, తొగర సామెల్, కల్తి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.