28-06-2025 12:00:00 AM
పోలీస్ కమిషనర్
ఖమ్మం, జూన్ 27 (విజయ క్రాంతి):బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులకు కోరారు.ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వివి ధ శాఖల సంబంధిత అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించి, సమస్యను పరిష్కరించడం వంటి లక్ష్యంతో కలిగిని ఈ కార్యక్ర మాన్ని విజయవంతం అయ్యేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యా పార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందా లు దాడులు నిర్వహించాలని, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ప్రత్యేక బృందాలు పట్టుబడిన పిల్లలను గుర్తించి వారి తల్లిదం డ్రులకు సురక్షితంగా అప్పగించాలని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందించి, అనాథ లుగా ఉంటే వారిని కేర్హోమ్కు తరలించే ప్రక్రియను దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని, స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ కోరారు.
సమావేశంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, సత్యనారాయణ , విజయ భస్కర్ రెడ్డి, (డిప్యూటీ కమిషనర్ ,కార్మిక శాఖ) టి. విష్ణు వందన (డిస్ట్రిక్ట్ చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్) డాక్టర్ చందన (నోడల్ ఆఫీసర్ హెల్త్ డిపార్ట్మెంట్)అనిత (చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు) ఇన్స్పెక్టర్ స్వామి పాల్గొన్నారు.