27-06-2025 10:37:16 PM
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణిలో విధులు నిర్వహించి ఈ నెల 30న పదవి విరమణ పొందనున్న అధికారులను సింగరేణి ఏరియా జీఎం జి దేవేందర్ ఘనంగా సన్మానించారు. శనివారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పదవి విరమణ పొందనున్న బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జిఎం సుశాంత్ సాహూ, జిఎం కార్పొరేట్ సోలార్ జానకిరామ్ లను వేరు వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏరియా జిఎం మాట్లాడుతూ సింగరేణిలో విధులు నిర్వహి స్తున్న అధికారులకు పదవి విరమణ అనివార్యంఅన్నారు, పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారో గ్యాలతో సంతోషంగాసాగాలని ఆయన ఆకాంక్షించారు.