24-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ‘తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి.. స్థానిక యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభు త్వం సంకల్పం’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. బుధవారం సచివాలయంలో సీఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీసీఐ, ఎలీప్, టిఫ్, టాప్మా, టీఎస్ టీఎంఏ తదితర పారిశ్రామికసంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. తెలంగాణ పురోగతి లో భాగస్వామ్యమవుతున్న పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, చట్టాలు, నిబంధనల పేరిట వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని వెల్లడించా రు. రాష్ర్టంలోని ప్రతీ పరిశ్రమను కాపాడుకుంటామని, ముఖ్యంగా రాష్ర్ట ఆర్థిక వ్యవ స్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగానికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు.
కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని వివరించారు. గత ప్రభుత్వం మాదిరిగా ఏకపక్షంగా వ్యహరించబోమని, తమది అందర్నీ కలుపుకునిపోయే ప్రభుత్వమని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరి సలహాలు, సూచనలు స్వీకరించి ఆచరణలో పెడతామన్నారు. పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని, ఈ ప్రయాణంలో పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
అందుకే పలు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మేధో మథనం చేశామని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్మోడల్గా మారిందని, ఏడాదిన్నర వ్యవధిలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి కొత్తగా రూ.3లక్షలకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చినట్టు వెల్లడించారు.
లక్షమందికి పైగా ఉపాధి కల్పించాం..
ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా ఉపాధి కల్పించినా, రాష్ర్టం నుంచి పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయంటూ బీఆర్ఎస్, బీజేపీ తమపై దుష్ర్పచారం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. కొత్తగా రాష్ట్రానికొచ్చిన పెట్టుబడుల గురించి సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు వివరించారు. రాష్ర్టంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో తెలంగాణ మినిమం వేజెస్ అడ్వుజరీ బోర్డు చైర్మన్ బీ జనక్ ప్రసాద్, ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్కుమార్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు సమీవుద్దీన్, రాజీవ్ వెంకటరమణ, రాంచంద్రారావు, శేఖర్రెడ్డి, జయదేవ్, రాజీవ్, సుజాత, రమాదేవి, సుధీర్రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.