calender_icon.png 4 June, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల త్యాగఫలమే మన తెలంగాణ

02-06-2025 12:15:15 PM

తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): ఎందరో త్యాగ ధనుల త్యాగ ఫలితం... అమరవీరుల పుణ్య ఫలమే మన తెలంగాణ అని మంథని సింగిల్ విండో చైర్మన్(Manthani Single Window Chairman) కొత్త శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం(Telangana Formation Day celebrations) సందర్భంగా మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయ ఆవరణలో చైర్మన్ శ్రీనివాస్ జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్బంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ అవమానాలు, అసమానతలను అంతం చేస్తూ... ఆత్మ గౌరవ ఉద్యమమే ఊపిరిగా...తెలంగాణ కల సాకారం కావడంలో అమరుల పాత్ర  ఎనలేనిదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన దేవత సోనియా గాంధీ అని, ఆంద్రప్రదేశ్ శాసన సభలో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత దుద్దిళ్ల శ్రీధర్ బాబు దేనన్నారు.

ఇప్పుడు  దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్ గా  తెలంగాణ రాష్ట్రం దూసు వెళ్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేతృత్వంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనేక పెట్టుబడులు తీసుకువస్తున్నరన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, గడ్డం పోచం, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మీ-మొండయ్య, ఉడుత మాధవి-పర్వతాల్ యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, ఆర్టిఐ మెంబర్ మంథని సురేష్, నాయకులు పెండ్రి సురేష్ రెడ్డి, మూల సరోజన, పురుషోత్తం రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, అజీమ్ ఖాన్, గోటికార్ కిషన్, పర్శవేని మోహన్, మేడ గొని రాజమౌళి గౌడ్, దాసరి గట్టయ్య, డిగంబర్,రామడుగు మారుతి రావు,  మంథని విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, మాజీ కౌన్సిలర్లు వీ కే రవి, కుర్ర లింగయ్య, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.