02-06-2025 12:17:32 PM
తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న
తుంగతుర్తి, విజయక్రాంతి: సూర్యాపేట జిల్లాలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్(Thungathurthi Agricultural Market Yard) ఆవరణంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావదినోత్సవని పురస్కరించుకొని జాతీయ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు సహకారంతో నియోజకవర్గంలో ప్రస్తుతం 1400 కోట్ల మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు మార్కెట్ యార్డ్ సెక్రటరీ సురేష్ కుమార్ ఎంపీడీవో. శేషు కుమార్ దొంగరి గోవర్ధన్ మండల పార్టీ అధ్యక్షులు. ఉప్పుల రాంబాబు టౌన్ అధ్యక్షులు . మార్కెట్ డైరెక్టర్లు అండ్ సిబ్బంది.మాచర్ల అనిల్ సంవిధాన్ కోఆర్డినేటర్స్ కొండరాజు సోషల్ మీడియా కోఆర్డినేటర్ పరశురాం, బొంకురి నాగయ్య తదితరులు పాల్గొన్నారు