26-11-2025 12:00:00 AM
భట్టి విక్రమార్కకి ఫోన్, లేఖ ద్వారా కాంట్రాక్టర్ల పరిస్థితి వివరణ
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
చిట్యాల, నవంబర్ 25 (విజయ క్రాంతి): తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తెలంగాణ శాసన మండలిలో మన ఊరు- మన బడి కాంట్రాక్టర్లు కలిసి పెండింగ్లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని వారు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ వారి సమస్యలు తెలుసుకుని, సానుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం , ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో ఫోన్ ద్వారా మాట్లాడి , రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మన బడి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అలాగే లేఖను రాసి కూడా డిప్యూటీ సీఎం కి పంపించారు. మన ఊరు - మన బడి పనులు చేసిన వారు చిన్న కాంట్రాక్టర్లు అని, వారి బిల్లులు రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.