మా మహిళా క్రికెటర్లను మభ్యపెడుతున్నారు
చాముండిపై టీసీఏ తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జూన్ 27 : తెలంగాణ క్రికె ట్ అసోసియేషన్ (టీసీఏ) మాజీ క్రికెటర్ చాముండేశ్వర్ నాథ్పై సంచలన ఆరోపణలు చేసింది. తమ అసోసియేషన్కు చెంది న మహిళా క్రికెటర్లను సంప్రదించి వారిని మభ్యపెడుతున్నారని ఆరోపించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు చా ముండేశ్వర్ నాథ్ టీసీఏ మహిళా క్రికెటర్లతో సంప్రదింపులు జరుపుతూ చేస్తున్న పరిణామాలను వెంటనే విరమించుకోవాలని హె చ్చరించింది.
తమ అంతర్గత విషయాల్లో జో క్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. దీని కి సంబంధించి తమ మహిళా క్రికెటర్ల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని వె ల్లడించింది. ఇలాంటి కార్యాకలాపాలకు చా ముండి దూరంగా ఉండాలంటూ సలహా ఇ చ్చింది. తమ ఆటగాళ్ళ అంతర్గత విషయా ల్లో జోక్యం వద్దని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి హెచ్చరించారు.






