calender_icon.png 2 January, 2026 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ స్థాయి రీడ్ ఇండియా సెలబ్రేషన్ పోటీలో పారమిత విద్యార్థి ప్రతిభ

02-01-2026 05:38:30 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని మంక మ్మతోట పారమిత ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి రాచమల్ల ఆద్య ఇటీవల రీడ్ ఇండియా నిర్వహించిన సెలబ్రేషన్ అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొని గ్రాండ్ ఫినాలేకు ఎంపికైనదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజి తెలిపారు. ఈ సందర్భంగా ఆద్యను పాఠశాల అధినేత డా. ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రశ్మిత, వినోదరావు, వి. యు.ఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యా యులు ప్రశాంత్, బాలాజి, కవిత ప్రసాద్, సమన్వయ కర్త శ్రీనాథ్, గైడ్ టీచర్ చంద్రసేన, ఉపాధ్యాయులు అభినందించారు.