02-01-2026 05:35:46 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా గ్రామంలో ధన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల అసోసియేట్ సౌదాసోత్ రవి, సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు మాట్లాడుతూ బ్యాంకు అకౌంట్,ఇన్సూరెన్స్, లోన్స్ గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.