గోర్గల్ వివాహ వేడుకలో ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్రెడ్డి
నిజాంసాగర్ మే 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామా గౌడ్ కుమార్తె వివాహ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజం గారి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ , డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం,నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి., మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య,నాయకులు జనార్దన్ రెడ్డి, నందస్ మోహన్,గంగి రమేష్, జక్సని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






