8 March, 2026 | 3:44 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

సునీత విలియం, బారీ విల్మోర్ రాక కోసం ఆక్స్ ఫర్డ్ విద్యార్థుల స్వాగత ప్రదర్శన..

18-03-2025 06:32 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): సుమారు 8 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియం, బారీ విల్మోర్ లను ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు తిరిగి భూమికి స్వాగతించే అద్భుత బ్యానర్లను మంగళవారం ప్రదర్శించారు. వారు సురక్షితంగా తిరిగి రావడానికి స్పేస్ ఎక్స్ చేసిన చారిత్రాత్మక ప్రయత్నాలను గౌరవిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు ఈ అద్భుత అంతరిక్ష యాత్రను వీక్షించడానికి ఎదురుచూస్తున్నారని స్కూల్ కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్ తెలిపారు. వ్యోమగాముల పట్టుదలను, ధైర్యాన్ని వారు ప్రశంసించారు. స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అకుంఠిత ప్రయత్నాల వల్ల రెస్క్యూ నౌక వలన ఇది సాధ్యమైనదని కొనియాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అంతరిక్ష పరిశోధనల పురోగతి గురించి, శాస్త్ర సాంకేతిక రంగాలను ఎంచుకోవడానికి ఇటువంటి సంఘటనలు వారిని ప్రేరేపించే విధంగా ఉన్నాయని వారు ఉత్సాహంతో తెలియజేశారు. యువ అభ్యాసకులలో అంతరిక్ష శాస్త్రం పట్ల ఉత్సుకతను పెంచడానికి ఈ పాఠశాల ఒక నిదర్శనంగా నిలిచింది. ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన బ్యానర్లతో విద్యార్థుల తల్లిదండ్రులు సెల్ఫీలు దిగి వ్యోమగాములతో కలిసి ఉన్నట్లుగా అనుభూతులను పొందుతున్నారు.