వరి ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి
12-06-2026 12:00 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, జూన్ 11 ( విజయక్రాంతి ) : గోదాముల వద్ద లారీలు ఎక్కువసేపు నిరీక్షించకుండా వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులోని లక్ష్మీ నరసింహ రైస్ మిల్ గోదామును ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, అన్లోడింగ్ పనులను పరిశీలించారు. లారీలు అధిక సంఖ్యలో వేచి ఉండటంతో కొన్ని లారీలను ఇతర గోదాములకు మళ్లించాలని డీసీఎస్ఓకు సూచించారు. హమాలీల సంఖ్యను పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.






