20 March, 2026 | 6:53 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్మికుల ధర్నా

18-04-2025 12:01 AM

మేడ్చల్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వేతనాలు విడుదల చేయాలని నినాదాలు చేశారు. డిపిఓ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు నెలలుగా వేతనాలు అందనందున కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైంది అన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మేడ్చల్ జిల్లా కోశాధికారి ఉన్ని కృష్ణన్, పంచాయతీ కార్మిక నాయకులు సుధాకర్, ఆరోగ్యం, ప్రశాంత్, శ్రీనివాస్, కృష్ణ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.