04-09-2025 09:20:05 PM
విజయక్రాంతి కథనానికి స్పందించిన ఆర్ డి ఓ శ్యామ్
సర్వే నెంబర్ 329 లో రెవెన్యూ అధికారుల పాక్షిక కూల్చివేతలు..
మరీ ఇంకో రూమ్ సంగతేంది..?
ఒక రూమ్ కూల్చి మరోదాన్ని కాపాడి..
ఆ అక్రమ రూమ్ సక్రమంగా నిర్మించినట్లేనా..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ప్రభుత్వ భూముల కబ్జాలకు యత్నిస్తే ఊరుకోబోమని చట్టపరంగా వారు సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుందని ఆర్ డి ఓ శ్యామ్(RDO Shyam) హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ మండల పరిధి దేవేందర్ నగర్ శివయ్య బస్తీకి ఆనుకొని సర్వే నెంబర్ 329 లో గల కబ్జాలను గురువారం ఆర్ డి ఓ శ్యామ్ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. విజయక్రాంతి తెలుగు దిన పత్రికలో ప్రచురితమైన వార్తలకు స్పందించిన ఆర్ డి ఓ శ్యామ్ పోలీసుల సహకారంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గదులను నేలమట్టం చేపించారు. కానీ అక్కడ రెండు రూములు నిర్మిస్తే రెవెన్యూ అధికారులు ఒక రూమ్ మాత్రమే కూల్చివేశారు. మరో రూమ్ సక్రమమేనా..? ఏమో మరీ ఆర్ డి ఓ కూల్చివేయమని ఆదేశాలు జారీ చేసినా కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు మాత్రం ఒక రూమ్ కూల్చడం పలు అనుమానాలకు తావిస్తుంది.