calender_icon.png 1 July, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

27-05-2025 05:33:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను సందర్శించి మాట్లాడారు. పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల బాధ్యత చాలా కీలకమైందన్నారు. పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని, అందుకు ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయుల సహకారం కూడా చాలా అవసరం అని ఆయన తెలిపారు.

విద్యార్థులు యొక్క నమోదు, విద్యార్థుల్లో విద్యా ప్రగతి, విద్యా కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థుల్లో సంపూర్ణ అభివృద్ధి, పాఠశాలలో నూతన కార్యక్రమాల అమలు, విద్యార్థులను పోటీ పరీక్షల్లో పాల్గొనేలా చేయడం, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా చూసుకోవడం, క్రీడా నైపుణ్యాలు అలవర్చడం, వారి ఆరోగ్య పరిస్థితిని నిత్యం సమీక్షించడం, క్రమశిక్షణను అలవర్చడం, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టడం, ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కలిసి గ్రామస్తులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని పాఠశాల అభివృద్ధికి కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నమోదును పెంచి పాఠశాలపై గ్రామస్తుల్లో నమ్మకం పెంచాలని సూచించారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, అభినందనలు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ నర్సయ్య, సీఎంఓ ప్రవీణ్ కుమార్, రీసెర్చ్ ఉపాధ్యాయులు తోడిసెట్టి పరమేశ్వర్,  మైసాజీ, రాజశేఖర్, విజయ్ కుమార్ లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.