15 March, 2026 | 6:04 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలి

15-03-2026 02:16 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తేనే పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

గోలేటి గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు జమ్మిడి అరుణ్ , మిడిగొండ లక్ష్మి - లింగమూర్తి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.