30-05-2025 05:04:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): తల్లిదండ్రులు పిల్లలను ప్రతిరోజు బడికి హాజరు అయ్యేలా చూడాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఎం పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం నిర్మల్ మండలంలోని మూటాపూర్ గ్రామంలో నిర్వహించిన పోషకుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరించారు. నాణ్యమైన విద్య పాటు ఉచితంగా నోటు పుస్తకాలు దుస్తులు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.