విద్యార్థులతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ.. నెట్టింట్లో వైరల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి(Andhra Pradesh Deputy Chief Minister), జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Janasena chief Pawan Kalyan) ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఈరోజు తమిళనాడు పర్యటనకు వచ్చిన ఆయన కుంభకోణంలోని ఆది కుంబేశ్వర ఆలయం(Kumbeswarar Temple)లో పూజలు చేశారు. తన పర్యటనలో, పవన్ కళ్యాణ్ స్థానిక విద్యార్థులు, నివాసితులతో ముచ్చటించారు.
వారితో సెల్ఫీలు తీసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా హర్షం వ్యక్తం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సోషల్ మీడియా(Janasena party social media)లో పరస్పర చర్యకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. దీంతో అది వైరల్ అయ్యింది. అంతకుముందు రోజు కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తంజావూరులోని స్వామిమలై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో ఆయన కుమారుడు అకీరా నందన్ కూడా ఆయన వెంట ఉన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రముఖ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా, గురువారం ఉదయం ఆది ప్రణవనాదం ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన, తమిళనాడు రాష్ట్రం, స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకుని, షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, ఆలయ ప్రాంగణంలో కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. శ్రీ స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆదిదంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటుగా కుమారుడు అకీరా నందన్, టీటీడీ సభ్యులు ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.




