బిల్లులు చెల్లించాలి
10-12-2024 01:00 AM
నిర్మల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికులపై ప్రభుత్వం చిన్న చూపు వహించడం సరికాదని, వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, గౌరవ వేత నం ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాదర్శి విలాస్, నాయకులు శంకర్ కోరారు. సోమవారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు పలికారు. బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం జాప్య చేయవద్దన్నారు.






