24-06-2025 01:15:30 AM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, జూన్ 23 (విజయ క్రాంతి), దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించిన మహానేత శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డిలో జన సంఘ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ రద్దుచేసి శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానానికి అంకితం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, మాజీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నరేందర్, కుంట లక్ష్మారెడ్డి, అన్నారం మోహన్ రెడ్డి, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.