22-06-2025 06:53:42 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షబ్బీర్ అలీ(Government Advisor Mohammed Ali Shabbir) నివాసంలో ఆదివారం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో అల్పాహార విందులో పాల్గొని స్థానిక ఎన్నికల కోసం పార్టీ బలోపేతం గురించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చము ఇచ్చి శాలువాతో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి సన్మానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.