calender_icon.png 6 June, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువుల అక్రమ రవాణాకు 'చెక్'

05-06-2025 12:10:18 PM

పెద్దపల్లి డి సి పీ స్పెషల్ ఆపరేషన్...

జిల్లాలో మూడు చోట్ల  చెక్ పోస్టుల ఏర్పాటు...

నిరంతరం పర్యవేక్షణ... వాహనాల రాకపోకలపై నిఘా: పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో పశువుల అక్రమ రవా ణాను కు చెక్ పెట్టేందుకు జిల్లాలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు  పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్( Peddapalli DCP Karunakar)  తెలిపారు.  జిల్లాలో  సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దుబ్బపల్లి వద్ద చెక్ పోస్ట్, పోత్కాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంపుల మానేరు బ్రిడ్జి వద్ద, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్పాజా వద్ద చెక్ పోస్టులను  ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో  పశువుల అక్రమ రవాణా నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. నిబంధ నలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు.

రాత్రి సమయంలో తప్పకుండా టార్చ్ లైట్ ఉపయోగించాలని సిబ్బందికి డిసిపి సూచించారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరి హద్దుల్లో మొత్తం మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ చెక్ పోస్ట్ ల వద్ద 24 గంటల పాటు నిరం తర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. పోలీస్ శాఖతో పాటు ఇతర సంబంధితశాఖల సిబ్బంది సమన్వయంతో షిఫ్ట వారీగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొ న్నారు. చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీ, వాహనాల ఎంట్రీ రికార్డుల పరిశీలనను స్వయంగా పరిశీలించి, అక్కడ విధులు నిర్వ ర్తిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పశు వుల రవాణా విషయంలో ఎలాంటి వివా దాలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ప్రత్యే క చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలి పారు.

ముఖ్యంగా జంతువుల అక్రమ రవా ణావంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సంబంధిత వాహనాల్లో చట్టబద్ధమైన ధ్రువీ కరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, అక్రమ రవాణా జరిగితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ఏ వ్యక్తి, సంస్థ స్వయంగా వాహనా లను ఆపకూడదనీ, ఈ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పద అక్రమ రవాణా గమనించిన పక్షంలో వెంటనే డయల్ 100 కు గాని నేరుగా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత, రెచ్చగొట్టే, అసభ్యకరమైన పోస్టులు పెడితే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంతంగా, మత సామరస్యంతో జరుపు కునేలా అవసరమైన చోట్ల ముందస్తుగా పటిష్టమైన పోలీసు బందోబస్తు, కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ  తెలిపారు.