18 August, 2026 | 4:51 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

స్కావెంజర్లకు పెండింగ్ వేతనాలను చెల్లించాలి..

16-04-2025 07:28 PM

ఇల్లెందు ఎంపీఓకు ఐఎఫ్టియు వినతి..

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీలో పాఠశాల స్కావెంజర్లకు, స్వీపర్, మెకానిక్, గ్రీన్ అంబాసిడర్లకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు మండల పంచాయతీ అధికారి(ఎంపిఓ) చిరంజీవికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, రాష్ట్ర సహాయకార్యదర్శి ఎండి. రాసుద్దిన్ మాట్లాడుతూ.. బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 7గురు స్కావెంజర్లకు 2023 అక్టోబర్ నుంచి 2024 జులై వరకు 10 నెలల వేతనాలు, గ్రీన్ అంబాసిడర్లు ఇద్దరికీ 2024 ఫిబ్రవరి నుంచి 2024 జూలై వరకు 6 నెలల వేతనాలు, బోర్ మెకానిక్ కు 2023 డిసెంబర్ నుంచి 2024 జూలై వరకు 8 నెలల వేతనాలు నేటికీ చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి తొగర సామెల్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు రావూరి ఉపేందర్ రావు, కార్మికులు పాల్గొన్నారు.