calender_icon.png 19 July, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు

19-07-2025 12:02:38 AM

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి, జూలై 18 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని రేవంత్ చావు భాష చూసి ప్రజలు అ సహ్యించుకుంటున్నారని పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా విమర్శించారు.

గత పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలనలో వలసల జిల్లాకే ఉపాధి కోసం వలసలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది .. 19 నెలల కాంగ్రెస్ పాలనలో పాలమూరు నుండి తిరిగి వలసలు మొదలయ్యాయన్నారు. 2014 వరకు కల్వకుర్తి ఎ త్తిపోతల పథకం కింద నీళ్లు అందింది 13 వేల ఎకరాలకు మాత్రమేననికాంగ్రెస్ అంటే పెండింగ్ కేసీఆర్ అంటే రన్నింగ్ భీమా , నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించింది కేసీఆర్ నేనన్నారు. జూరాల చివరి ఆయకట్టుకు సా గునీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదని కల్వకుర్తి ఎత్తిపోతల కింద దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదన్నారు.

90 శాతం పూర్తయిన పా లమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను 19 నెలలుగా పడావు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అ ని పూర్తయిన టెండర్లను రద్దు చేసి వందల కోట్ల అదనపు భారం మోపుతున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదని, కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలమూరు బిడ్డను చెప్పుకుంటున్న రేవంత్ గత 19 నెలలలో తట్టెడు మన్ను ఎత్తిన పాపాన పోలేదు .. ఒక్కసారి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప నుల మీద సమీక్ష చేయలేదని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తన మామ సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నందుకయినా దాని పనులు వేగవంతం అవుతాయి అని అనుకున్నామని పేరు పెట్టి ఏడు నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి లేదన్నారు.

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని కాళ్లు తంగెళ్లు దాటడం లేదని రేవంత్ నాయకత్వంలో పాలమూరుకు మేలు జరగడం సంగతి తర్వాత కీడు చేయకుంటే అదే పదివేలేనన్నారు. మే నెలలో కృష్ణా నదికి వరద మొదలైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేయకుండా 45 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి సగం చెరువులు, కుంటలు నిండేవన్నారు.

కేసీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని రాజకీయాల్లో హత్యలుండవ్ ఆత్మహత్యలే ఉంటాయని అభివృద్ధి చేసేందుకు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి తన చర్యలను వ్యతిరేకించిన వారి మీద పగ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడన్నారు. రాజకీయాల్లో ఎందరో నియంతలు నేలకూలారని వారి సరసన భవిష్యత్తులో రేవంత్ చేరడం ఖాయమని ప్రభుత్వ అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చి ప్రతిపక్ష నేత మీద చావు భాష ప్రయోగిస్తున్న ఏకైక సీఎం రేవంత్ ఆయన హితువు పలికారు.