calender_icon.png 4 August, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

25-07-2025 01:29:40 AM

భద్రాద్రి కొత్తగూడెం, జులై 24, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు రోజులుగాకురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రక టనలో తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వరదలు సంభవించే ప్రాంతాలను గు ర్తించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వరద ప్రవాహ సమయంలో నదులు, కాలువలు, చెరువులు వంటి జ లవనరుల వద్దకి వెళ్లకూడదని, వాటిని దాటేందుకు ప్రయత్నించరాదని స్పష్టం చేశారు. రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తాగునీరు కలుషితమయ్యే అవకాశాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రా మాల్లో పారిశుద్ధ్యం కాపాడుతూ, వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలనారు. తాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవా లన్నారు.

విద్యుత్ సరఫరా నిలిచిన సందర్భం లో ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్య లు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రసవం సమీపించిన గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులు లేదా గర్భిణీల వసతి కేంద్రాలకు తరలించాలని సూచించారు.