26 May, 2026 | 6:06 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం

26-05-2026 05:25 PM

రామయంపేట, (విజయకాంత్రి): రామాయంపేట మండల కేంద్రంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలో ఆయా సంఘాల బాధ్యులు హాజరై బాధితుల సమస్యలను విని సంబంధిత పత్రాలను పరిశీలించడం జరిగింది. ఈ మేరకు బాధితులు వారికున్న సమస్యలతో పాటు దరఖాస్తు ఫారాలు సంబంధిత రికార్డులను దళిత సంఘాలకు పెద్దలకు అప్పగిస్తూ సమస్యల పరిష్కార దిశగా న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ బాధిత దరఖాస్తులలో భూమి హాస్పిటల్ గ్రామపంచాయతీ ప్రైవేటు ప్లాట్ల సమస్యలు రాగా ఈ సమస్యల పరిష్కారానికి దళిత సంఘాల జేఏసీగా అందరం కలిసికట్టుగా ఉండి సమస్యల సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం పనిచేసి బాధితులు ఆదుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘాల బాధ్యులు పాతూరి  రాజు, దుబాసి సంజీవ్, ఉషన్న గారి మురళి, మాసాయిపేట మల్లేశం, శ్యామల అశోక్, లద్ద నర్సింలు, దండోల్ల సామెల్, సిద్ధ రాములు తదితర బాధితులు పాల్గొన్నారు