calender_icon.png 20 May, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను అప్రమత్తం చేయాలి

20-05-2025 12:13:31 AM

కామారెడ్డి, మే 19 (విజయ క్రాంతి), వచ్చేది వర్షాకాలం సీజన్ కావడంతో వరదలు వస్తే ఎలా ఎదుర్కోవాలో ఎన్‌డిఆర్ ఎస్ బృందాలు ప్రజలకు అవగాహన కల్పి ంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు.

సోమవారం సాయంత్రం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలతో మాకు డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అప్రమత్తం చేసే విధంగా చూడాలన్నారు.  సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పోలీసు, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత అనుభవాలు, సంఘటనల ఆధారంగా జిల్లాలో వరదల నేపథ్యంలో ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలించడం, అప్రమత్తం చేయడం వంటి కార్యక్రమాలను ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ ద్వారా మంగళవారం స్థానిక పట్టణంలోని జీ.ఆర్.కాలనీ, జీవధాన్ ప్రాంతాలలో ఎన్.డి.ఆర్.ఎఫ్. వారిచే నిర్వహించే కార్యక్రమానికి సంబంధిత అధికారులు పాల్గొనాలని తెలిపారు.

అదనపు కలెక్టర్ (రెవిన్యూ) విక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు, వరదలు సంభవించినపుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. రేపు జరిగే మాక్ డ్రిల్‌లో పాల్గొనాలని తెలిపారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ ఈ ఈ రవిశంకర్, డిపీవో మురళీ, జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్ లు రాజేందర్ రెడ్డి, శ్రీహరి, మహేష్, పలు శాఖల అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.