17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

జిల్లాలో 90 శాతం రెవెన్యూ సదస్సులు పూర్తి

20-06-2025 12:45 AM

ఇప్పటి వరకు 28,118 దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూన్ 19(విజయక్రాంతి): భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులు 90 శాతం పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  తెలిపారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా టేక్మాల్ మండలంలో  ఎల్లంపల్లి గ్రామంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న నూతన భూభారతి రెవెన్యూ చట్టం 2025 రెవెన్యూ సదస్సును కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  భూభారతి రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తులు అతి త్వరలో పరిష్కారం అవుతాయని చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా, భూభారతి చట్టంలోని నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ  క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.