20-06-2025 12:47:01 AM
కంగ్టి, జూన్ 19: జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలని గురువారం కంగ్టి మండల జర్నలిస్టులు స్థానిక ఎంఈఓ రహీముద్దీన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్ సుదర్శన్ దేశాయ్ మాట్లాడుతూ ఈనెల 11న సంగారెడ్డి జిల్లా విద్యాధికారి జారీ చేసిన సర్క్యూ లర్ ప్రకారం మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో వంద శాతం రాయితీ కొరకు అన్ని పాఠశాలలకు సమాచారం అందించి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకర్లు రాంరెడ్డి, ప్రవీణ్, సంగ్రామ్, మారుతీ, రమేష్, విజయ్, జలీల్, సాయిలు, సల్మాన్ పాల్గొన్నారు.