calender_icon.png 20 June, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి

20-06-2025 12:47:01 AM

కంగ్టి, జూన్ 19: జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలని గురువారం కంగ్టి మండల జర్నలిస్టులు స్థానిక ఎంఈఓ రహీముద్దీన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్ సుదర్శన్ దేశాయ్ మాట్లాడుతూ ఈనెల 11న సంగారెడ్డి జిల్లా విద్యాధికారి జారీ చేసిన సర్క్యూ లర్ ప్రకారం మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో అమలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో వంద శాతం రాయితీ కొరకు అన్ని పాఠశాలలకు సమాచారం అందించి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకర్లు రాంరెడ్డి, ప్రవీణ్, సంగ్రామ్, మారుతీ, రమేష్, విజయ్, జలీల్, సాయిలు, సల్మాన్ పాల్గొన్నారు.