25 April, 2026 | 1:35 AM

లీకేజీల అడ్డుకట్టకు శాశ్వత చర్యలు

29-11-2024 01:49 AM

జలమండలి డీజీఎం మోహన్‌రాజ్

ముషీరాబాద్, నవంబర్ 28: ముషీరాబాద్ నుంచి సాగర్‌లాల్ దవాఖాన ప్రధాన రోడ్డు వరకు మంచి నీటి పైప్‌లైన్ లీకేజీలను అరికట్టేందుకు 1000 ఎంఎం భారీ మంచి నీటీ పైప్‌లైన్‌లను ఏర్పాటు చేస్తున్నామని జలమండలి రిజర్వాయర్ డీజీఎం మోహన్ రాజ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్‌లోని చిలకలగూడ రిజర్వాయర్ నుంచి కొనసాగుతున్న పైప్‌లైన్ నిర్మాణ పనులను సెక్షన్ మేనేజర్ సురేశ్‌తో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు రూ.3.66 కోట్లతో చేపడుతున్న నిర్మాణ పనులు నెలరోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రిజర్వాయర్ ప్రధాన గేటు వరకు, దాయారం మార్కెట్ నుంచి సాగర్‌లాల్ దవాఖాన చౌరస్తా వరకు పైల్‌లైన్ నిర్మాణ పనులు కొనసాగిస్తామని తెలిపారు.