20-06-2025 12:00:00 AM
విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
రాజేంద్రనగర్, జూన్ 19: తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలె త్తింది. దీంతో తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేసిన సంఘటన గురువా రం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. స్పుసై స్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకొచ్చి ల్యాండింగ్ చేశారు.
గురువారం ఉదయం శంషాబాద్ నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపట్లో తిరుపతికి చేరుకుంటుందనగా పైలట్ టెక్నికల్ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. వెంటనే వెనక్కి వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరిపించుకున్నారు. తాము తిరుపతి వెళ్లేందుకు మరో విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకుదిగారు.