30 June, 2026 | 9:41 PM

Breaking News

ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •  

డ్యూటీ చేస్తా.. ఇబ్బందులు తొలగిస్తా..

17-03-2026 08:21 PM

ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తాను డ్యూటీ చేస్తూనే ప్రజల ఇబ్బందులను తొలగిస్తున్నానని  ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా పాయింట్ వద్ద కరీంనగర్ పెద్దపల్లి రహదారి పైన చాలా రోజుల క్రితం గుంత పడడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.

ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్  సిమెంట్ తీసుకువచ్చి కంకర కలిపి పూడ్చి వేశారు. దీంతో ఆ దారి గుండా పోయే ప్రజలు వాహన చోదకులు అనిల్ ను అభినందించారు. గుంతలు కనిపిస్తే వెంటనే పూడ్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అనిల్ సూచించారు.