20-02-2026 01:37:10 AM
గాంధారి ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మకంగా చేపడుతున్న సీఎం కప్ క్రీడా పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం విద్యార్థులు సంధ్య యాదవ్, అమ్ములు ఎంపిక అయినట్లు వ్యాయమా ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు.
ఈ నెల 12 నా జిల్లా కేంద్రం లో నిర్వహించిన పోటీలో అద్భుతంగా రాణించడం తో వీరిని ఎంపిక చేశారు. నేటి నుండి హైదరాబాద్ లోని గచ్చిబౌలి క్రీడా మైదానం జరిగే పోటీలకు కామారెడ్డి నుండి ప్రాతినిద్యం వహిస్తారని అయన అన్నారు.