26-06-2025 09:57:38 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లోని రైతుబజార్ గా పేరొందిన కొత్తగూడెం కూలీ లైన్ ఏరియాలో పండ్లు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై సింగరేణి యాజమాన్యం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు జేబీ శౌరి గురువారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీధి వ్యాపారులు, పండ్ల దుకాణదారులు, రోడ్డుపై బిక్షాటన చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, నగరపాలక సంస్థకు, తమ భార్యాపిల్లలకి ఒక ముద్ద అన్నం పెట్టుకునే అవకాశం కల్పించాలని కలెక్టర్ కు విన్నవించుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే ఈ సమస్యపై, ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన, నేనే మీ దగ్గరకు వస్తానని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సమస్యను సత్వరమే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.