calender_icon.png 27 June, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాల్వంచలో ర్యాలీ

26-06-2025 10:00:14 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్(DSP Satish Kumar) ఆధ్వర్యంలో పాల్వంచలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత తరంపై మాదకద్రవ్య వ్యసనం యొక్క విధ్వంసక ప్రభావాన్ని, అది శరీరానికి హాని కలిగించడమే కాకుండా కుటుంబాలను, సమాజాలను కూడా నాశనం చేస్తుందన్నారు.

మాదకద్రవ్య వ్యసనానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సమాజంలో యువతరం మాదకద్రవ్యాల ఆకర్షణను నిరోధించడం ప్రాముఖ్యతపై పాల్వంచ పోలీసు వారి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ర్యాలీలో పాల్వంచ సీఐ K సతీష్, ఎస్సై K సుమన్, I జీవన్ రాజు, దేవ్ సింగ్, కళ్యాణి, సిబ్బంది, తహశీల్దార్ దారా ప్రసాద్, ఎక్సైజ్ సీఐ ప్రసాద్, సిబ్బంది, కేటీపీఎస్ ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఫారెస్ట్ సిబ్బంది, కేఎల్ఆర్, అనుబోస్, కృష్ణవేణి కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.