04-06-2025 01:02:50 AM
మృతుడి కుటుంబానికి 4లక్షలు అందజేత
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): సీఎం ప్రజావాణి చొరవతో ఓ బాధిత కుటుంబానికి రావల్సిన పీఎఫ్ అందింది. హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన పాల ప్రవీణ్ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఐదేళ్ల క్రితం ప్రమాదవశాత్తు చనిపోయారు. నామినీగా ఉన్న కుటుంబ సభ్యులకు సంస్థ నుంచి రావల్సిన పీఎఫ్ కోసం ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది.
మూడు నెలల క్రితం సీఎం ప్రజావాణికి వచ్చి సమస్యను వివరిస్తూ మృతుడి తల్లిదండ్రులు పిటీషన్ ఇచ్చారు. ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజ్ల ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగి ప్రైవేటు సంస్థ, పీఎఫ్ అధికారులతో సంప్రదింపులు జరిపారు.
మృతుడు ప్రవీణ్కు రావాల్సిన రూ.4 లక్షలు ఇప్పించారు. మంగళవారం మహాత్మా జ్యోతిబాఫూలే అంబేద్కర్ భవన్లో జరిగిన సీఎం ప్రజావాణికి మృతుడి తల్లిదండ్రులు పాల నాగేశ్వరరావు, రామలక్ష్మి వచ్చి ఈ విషయాన్ని తెలిపారు. తమను ఆదుకున్న సీఎం రేవంత్రెడ్డి, ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలకు ధన్యవాదాలు తెలిపారు.