04-06-2025 01:00:10 AM
- 9 నెలల చిన్నారికి కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): దక్షిణ అమెరికా గయానాలోని భారతీయ మూలాలున్న దివేక ధన్రాజ్, సతీష్ సకిష్ణు దంపతులకు జన్మించిన 9 నెలల లావణ్య అనే చిన్నారి పుట్టుక నుంచి వినికిడి లోపం తో బాధపడుతున్నది. మాటలు కూడా రావ డం లేదు.
ఇటీవల హైదరాబాద్లోని అపో లో ఆస్పత్రిలో వైద్యులు ఆ చిన్నారికి శబ్ధజ్ఞాన (కోక్లియర్ ఇంప్లాంట్) శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను సొసైటీ టు ఏయిడ్ ది హియరింగ్ ఇంపైర్డ్ (సాహి), శ్రీ సత్యసాయి సంస్థ సహకారంతో నిర్వహించారు. అంతుకుముందు చిన్నారికి మెరుగైన వైద్యం కోసం బ్రెజిల్, వెనిజులా, అమెరికా, కెనడా దేశాల్లో సంప్రదించినా ఆర్థిక కారణాల వల్ల చికిత్స సాధ్యపడలేదు. లవణ్యకు ’కోక్లియర్ హైపోప్లాసియా’ మరి యు ఎడమ చెవిలో అసాధారణ కోక్లియా నిర్మాణం ఉన్నట్లు స్కానింగ్లో తేలింది.
దీంతో అంతర్జాతీయ వైద్య కేంద్రాలు శస్త్రచికిత్సకు నిరాకరించాయి. కానీ శ్రీ సత్యసాయి సంస్థ ద్వారా సాహి మరియు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిని సంప్రదించగా శిశువు చేర్చుకుని గత నెల 17న అపోలో ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ ఈసీ వినయ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కే రాంబాబు, డాక్టర్ జస్విందర్ సింగ్ సలూజా, ఇంప్లాంటేషన్ ఆడియాలజిస్ట్ డాక్టర్ ఐ శ్రీకాంత్ నేతృత్వంలో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.
ఈ బృందం ఇప్పటికే 2,700 కంటే ఎక్కువ కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. 30 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉంది.అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈవో తేజేశ్విరావు మాట్లాడుతూ.. లావణ్య శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటుందని, ఆమె మాటల ప్రపంచంలో అడుగులు వేయడానికి సిద్ధమవుతుందని తెలిపారు.