04-06-2025 01:03:11 AM
ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన బిరుదురాజు రామరాజు ప్రత్యేక సంచిక పునాసను మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా పునాస పత్రికను ఆవిష్కరించడం గొప్ప విషయమని, అందులో తెలంగాణ ప్రముఖులైన కొందరి శతజయంతి సందర్భంగా ప్రత్యేక సంచికలు తీసుకురావడం చాలా బాగుంది అని మంత్రి జూపల్లి అన్నా రు.
రామరాజు లాంటి గొప్ప పండితుడు, పరిశోధకుడు తెలంగాణలో జన్మించడం ఈ నేల చేసుకున్న అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో కవి యాకూబ్, సాహిత్య కారులు, సాహిత్య అకాడమీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.