22-02-2026 12:53:54 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): రామాంతపూర్లోని అరోరా పీజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ వై.లక్ష్మిహైదరాబాద్లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ నుంచి కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) పట్టాను అందుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్య విద్యార్థుల మధ్య డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ విశ్లేషణపై అధ్యయనం చేశారు. డాక్టర్ లక్ష్మీ తన పరిశోధనను డాక్టర్ ఎస్. ప్రతాప్ మార్గదర్శకత్వంలో పూర్తి చేశారు. ఈ ఘనత సాధించినందుకు ఆమెని పలువురు అభినందించారు.