30-05-2025 06:06:08 PM
ఆర్టీసి నిర్మల్ డిపో మేనేజర్ పండరి
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి ప్రణాళికలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. శుక్రవారం ఆయన ఖానాపూర్ బస్టాండ్ ను పరిశీలించారు. ప్రైవేట్ వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులతో చర్చించామని దాంతోపాటు కాంపౌండ్ వాల్ నిర్మాణం, మరుగుదొడ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పిస్తామని అన్నారు.
బస్టాండ్ లోపల ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ను మరమ్మత్తులు చేపట్టి, మిగిలిన షాపులకు టెండర్లు పిలిస్తామని అన్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. దాంతోపాటు ఖానాపూర్ నుంచి సాయంకాలం శంషాబాద్ కు ఉన్న బస్సు సర్వీస్ను కడెం కు పొడిగించే ప్రతిపాదన చేస్తామని అన్నారు. దాంతోపాటు తెల్లవారుజామున 5: 15 హైదరాబాద్ బస్సును పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు .ఆయనతోపాటు ఆర్టీసీ ఇంజనీర్ అధికారులు, కంట్రోలర్ పోశెట్టి తదితరులు ఉన్నారు.