calender_icon.png 1 June, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్​లైన్​లో మోసం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ కేసు నమోదు

30-05-2025 06:17:13 PM

తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు

తుంగతుర్తి,(విజయక్రాంతి): ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని వోల్వో బస్సు డ్రైవింగ్ నేర్పించి మరియు డ్రైవర్ గా జాబ్ ఇప్పిస్తానని ఫోన్ కాల్ ద్వారా నమ్మించిన పల్నాడు జిల్లా మాచర్ల కు చెందిన వరప్రసాద్ అనే నిందితున్ని అరెస్టు చేయడం జరిగినది. పిర్యాదు తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4,30,000/- తన ఫోన్ పే ఖాతాలోకి కొట్టించుకొని చాలా రోజూలుగా తప్పించికుంటూ ఫిర్యాదికి అబద్దపు మాటలు చెప్పి మోసపరచిన నిందితుడుపై నూతనకల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పథకం ప్రకారం పట్టుబడి చేసి శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగినదని  తుంగతుర్తి సీఐ తెలిపినారు. 

పట్టుబడిన విధానం:  ఉదయం పోలీస్ వారి సలహా మేరకు ఫిర్యాది నెరస్తుడికి ఫోన్ చేసి తను అడిగిన కొంత డబ్బులని సూర్యాపేట కి వస్తే ఇస్తా అని చెప్పగా నేరస్థుడు మాచర్ల నుండి సూర్యాపేట కి రాగా నేరస్తుడిని నూతనకల్ పోలీస్ సిబ్బంది సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో ఉదయం 11.00 గంటల సమయంలో పట్టుబడి చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ కి తీసుకురాగా తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. నరసింహ రావు  నేరస్తుడిని తుంగతుర్తి గౌరవ కోర్టు నందు హాజరు పరచి రిమాండ్ కి పంపించనైనది. తుంగతుర్తి సర్కిల్ ప్రజలు ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.