calender_icon.png 9 June, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్ననాటి నుంచే మొక్కలు నాటడం అలవర్చుకోవాలి

06-06-2025 12:16:57 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్

నాగర్ కర్నూల్ జూన్ 5 ( విజయక్రాంతి ) ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం చిన్ననాటి నుండే మొక్కలు నాటే అలవాటు అలవర్చుకోవాలని నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రమాకాంత్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మనసులో మాటలను పంచుకున్నారు. మానవాళి మనుగడకు మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తే అది మన వినాశనానికి దారితీస్తుందన్నారు.

కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ వెంకట్ రామ్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి ఎన్ శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి కాంత్ రావు, జనరల్ సెక్రటరీ మధుసూదన్ రావు ,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దేవరాజు ఇతర ఫారెస్ట్ అధికారులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులుపాల్గొన్నారు.