06-06-2025 12:16:56 AM
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి’ అనే ఇతివృత్తాన్ని స్వీకరించి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో విద్యార్థులు, అధ్యాపకులు ప్లకార్డులు పట్టుకుని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, సమాజంలో పచ్చని అలవాట్లను ప్రోత్సహించాలని ప్రతిజ్ఞ చేశారు. కళాశాల డైరెక్టర్ రెవరెండ్ ఫ్రమ్ ఆంథోనీ వినయ్, అధ్యాపకులు పర్యావరణ రక్షణలో సమిష్టి బాధ్యత అవసరాన్ని నొక్కి చెప్పారు.