24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

ప్రతి ఏటా అడవుల్లో రాజుకుంటున్న నిప్పు

03-05-2026 02:14 PM

అర్బన్ పార్కుకు తప్పని ముప్పు

శనివారం రాత్రి అర్బన్ పార్కులో కాలిపోతున్న మొక్కలు

బోథ్,(విజయక్రాంతి): ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రోడ్లకు ఇరువైపులా అడవుల్లో మొక్కలను నాటుతున్నారు.అయితే ప్రతి ఏటా వేసవికాలంలో అడవులలో అగ్ని ప్రమాదాలు సంభవించడం నాటిన మొక్కలు అగ్నికి  బూడిదవుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్న ఫలితాలను ఇవ్వడం లేదు. 44వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అర్బన్ పార్క్ లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వేలాది మొక్కలు కాలిపోయాయి. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 60 వేల మొక్కలు అర్బన్ పార్క్ లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు సైతం అగ్ని ప్రమాదాల్లో కాలిపోతున్నాయి