17-12-2025 12:00:00 AM
షబ్బీర్ అలీకి దోమకొండ సర్పంచ్ వినతి
కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయశాంతి): కామారెడ్డి జిల్లా ,దోమకొండలో ఈనెల 20న సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేయుచున్న సందర్భంగా అట్టి ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని కోరుతూ మంగళవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి, రాష్ట్ర నాయకులు ఇలియాస్ కి పుష్పగుచ్చం అందజేసి విన్నవించారు.
దోమకొండ గడికోట వారసులు కామినేని శోభన, అనిల్ కుమార్ కి,మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రమాణ శ్రీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతామని తెలిపినట్లు ఐరేని నర్సయ్య చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, బత్తిని సిద్ధ రాములు, బుర్రి లింగం, తదితరులు పాల్గొన్నారు.