14 July, 2026 | 11:16 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

మన్మోహన్ సింగ్‌కు ప్రధాని మోదీ నివాళులు

27-12-2024 10:28 AM

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూశారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modiనివాళలర్పించారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత రాత్రి కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ నివాసంలో కేంద్ర హోంశాఖ అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ నివాసానానికి పార్థివదేహాన్ని తరలించారు. రేపు ఏఐసీసీ (All India Congress Committee) ప్రధాన కార్యాలయాంలో ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థివదేహం ఉంచనున్నారు. 

శనివారం ఢిల్లీ రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కరాలు నిర్వహించనున్నారు. కేంద్రప్రభుత్వం(Central Government)అధికారిక లాంచనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనుంది. మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలకు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది. ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశించింది. వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర ఆదేశించింది.