calender_icon.png 21 June, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ

21-06-2025 08:20:22 AM

  1. 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి. 
  2. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే.
  3. యోగాకు సరిహద్దుల్లేవు.. వయసుతో పనిలేదు.
  4. యోగా మనల్ని నడిపిస్తుంది. యోగా మనల్ని మేల్కొలుపుతుంది. 
  5. యోగా వ్యక్తిగత క్రమశిక్షణకు మారుపేరు. 
  6. యోగా ప్రక్రియతో చికిత్స.
  7. యోగాను  ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇకో సిస్టం.
  8. రోజూ మనం తినే ఆహారంలో 10 శాతం నూనె తగ్గించాలి. 
  9. సంతులిత జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.  

  10. అమరావతి:  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day ) పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా డేలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయని చెప్పారు. గుండె, నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందని తెలిపారు. మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతోందన్నారు. యోగా ప్రపంచ దేశాలను కలిపిందని వెల్లడించారు. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి.. 175 దేశాల్లో  యోగా చేయడం సాధారణ విషయం కాదని  ప్రధాని పేర్కొన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అన్నారు.  గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని ప్రధాని వివరించారు. యోగాకు వయస్సుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవన్నారు. ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అన్నారు.

నారా లోకేష్(Nara Lokesh) కూడా యోగాంధ్ర కార్యక్రమం కోసం కృషి చేశారు. కొత్త కార్యక్రమాల రూపకల్పనలో లోకేష్ చొరవ ప్రశంసనీయం అని ప్రధాని పేర్కొన్నారు. మనిషి ప్రకృతిలో భాగస్వామి అని యోగా గుర్తుచేస్తుందని, యోగాతో వక్తిగత క్రమశిక్షణ అలవడుతుందని ప్రధాని స్పష్టం చేశారు. యోగా వల్ల శాంతి, స్థిరత్వం సాధించవచ్చని మోదీ తెలిపారు. అంతర్గత శాంతి ప్రపంచ విధానం కావాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి(Indian culture) అందరి క్షేమం కాంక్షిస్తుందన్నారు. యోగాపై దేశంలోని అనే వైద్యసంస్థలు పరిశోధన చేస్తున్నాయన్న ప్రధాని నరేంద్ర మోదీ యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయన్నారు. ఊబకాయం ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వంటల్లో పదిశాతం నూనె తగ్గింపును ఛాలెంజ్ గా స్వీకరించాలి.. సంతులిత జీవన శైలిని అలవాటు చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.  ప్రపంచ శాంతికి యోగా ఓ మార్గం అన్నారు. యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతోందన్నారు. మనం అన్న భావన మానవత్వాన్ని పెంచుతుందన్నారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్ థీమ్ తో ఈ సారి యోగా దినోత్సవాన్ని నిర్వహించామని ప్రధాని తెలిపారు. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానానికి ఇకో సిస్టమ్ ను డెవలప్ చేస్తున్నామని పేర్కొన్నారు. యోగా గురించి మన్ కీ బాత్ లో కూడా  విస్తృతంగా చర్చించానని ప్రధాని తెలిపారు.