11-02-2026 04:46:17 PM
న్యూఢిల్లీ: కెనడాలో జరిగిన సామూహిక కాల్పుల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కెనడాలో జరిగిన భయంకరమైన కాల్పుల ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో భారతదేశం కెనడా ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుందని ఆయన ఎక్స్ లో రాశారు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని ఓ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. అనుమానితుడు స్వయంగా చేసుకున్న గాయం కారణంగా మరణించాడు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) ప్రకారం... స్థానిక వైద్య కేంద్రంలో మరో 25 మంది గాయాలను అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్రిటిష్ కొలంబియాలోని పీస్ ప్రాంతంలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.