14 April, 2026 | 8:40 PM

రోడ్డు ప్రమాద బాధితులకు అండ ‘పీఎం రాహత్’

18-02-2026 01:30 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభు త్వం ‘పీఎం రాహత్’ పథకంతో గొప్ప ముందడుగు వేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగి న వెంటనే గొల్డెన్ అవర్‌లో అత్యవసర చికిత్స అందించనున్నారని తెలిపారు. ఎలాంటి రోడ్డు ప్రమాదమైనా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స ఇవ్వనున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స అందిస్తారన్నారు